యాప్నగరం

వైఎస్ షర్మిలకి షాక్.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

రాజన్న రాజ్యం తెచ్చేవరకూ పోరాటం చేస్తామంటూ వైఎస్ షర్మిల అట్టహాసంగా ప్రారంభించిన పార్టీలో అప్పుడే అంతర్గత పోరు మొదలైంది. పదవులు అమ్ముకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ నేత.

Samayam Telugu 30 Jul 2021, 4:57 pm
ఆదిలోనే హంసపాదు ఎదురైందన్నట్టు!! అప్పుడే పెట్టిన పార్టీలో అంతర్గత పోరు విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెడితే నేతల కుమ్ములాటలు అధినేత్రికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. వైఎస్ షర్మిల నూతన పార్టీ వైఎస్సార్‌టీపీలో అప్పుడే అంతర్గత పోరు మొదలైంది. పదవులు అమ్ముకుంటున్నారంటూ కీలక నేత పార్టీ కార్యాలయంలో రచ్చ చేయడం చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారంటూ దేవరకద్రకి చెందిన నర్సింహా రెడ్డి ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sharmila


పార్టీ పదవులు 5 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని.. రాత్రికి రాత్రే పేర్లు మార్చేశారంటూ నర్సింహా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తాను షర్మిలను వ్యతిరేకించడం లేదని.. కానీ పార్టీలో ఉన్న కోవర్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉంటే ముక్కూమొహం తెలియని వాళ్లకి పదవులెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో పదవులు ఎవరు అమ్ముకుంటున్నారో తనకు తెలుసని.. పదవులు అమ్ముకుని పార్టీని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లారని ఆయన మండిపడ్డారు. తాగుబోతులకు పదవులు అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.