యాప్నగరం

సీఎం కేసీఆర్‌ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

KCR Birthday సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 17 Feb 2020, 4:19 pm
వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా సోమవారం (ఫిబ్రవరి 17) ప్రగతి భవన్‌లో ఆయణ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల రాకతో ప్రగతి భవన్‌లో సందడి నెలకొంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu roja


కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన మనవడు హిమాన్షు.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసి బర్త్‌డే విషెస్ చెప్పిన వారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, వివిధ సంఘాల నాయకులు ఉన్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.