యాప్నగరం

అప్పుడు కొనమని చెప్పి ఇప్పుడు కొంటానన్న సన్నాసులెవరు.. చివరికి రైతును దోషిని చేస్తారా: షర్మిల

వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆమె బుధవారం ట్వీట్ చేశారు.

Authored byRaj Kumar | Samayam Telugu 18 May 2022, 1:57 pm
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం-2022 పంటల సాగు సన్నాహక సమావేశంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ వర్షాలను సీఎం కేసీఆర్ ఆపుతారా? అంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu వైఎస్ షర్మిల


‘పంట లేటుగా వేస్తే, గాలివాన వస్తే సీఎం ఆప్తాడా అని చేతకాని మాటలు చెబుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి గారు, వరి వేస్తే ఉరేనని పంటలు లేట్‌గా వేసుకునేలా చేసింది ఎవరు? కొనం కొనం అని చివరకు కొంటానన్న సన్నాసులు ఎవరు? వానలు వచ్చే కంటే నెల రోజుల ముందే కల్లాల్లో వడ్లు పోసి రైతు తయ్యారుగుంటే మీరేం చేస్తున్నారు?’ అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

ఎన్ని వడ్లు కొంటానని ఎన్ని కొన్నారని ఆమె నిలదీశారు. కాంటాలు పెట్టడం, టార్ఫాలిన్ కవరు, సంచులు ఇవ్వడం చేతకాలేదు కానీ.. పంటలు లేట్‌గా వేసుకున్నారు కాబట్టే వర్షానికి వడ్లు తడిసే పరిస్థితి వచ్చింది అంటూ రైతులదే తప్పని చెప్తున్నారా? అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు పండించినందుకు రైతును దోషిని చేస్తున్నారా? అంటూ ట్విట్టర్ వేదికగా షర్మిల ప్రశ్నలు గుప్పించారు.

రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.