యాప్నగరం

Corona: తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు.. మూడేళ్ల తర్వాత తొలిసారిగా..

Telangana Corona Cases: తెలంగాణలో శుక్రవారం జీరో కొవిడ్ కేసులు నమోదైనట్లు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం 3,690 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. ఒక్కరికి కూడా వైరస్ సోకలేదని చెప్పారు. మూడేళ్ల తర్వాత జీరో కొవిడ్ కేసులు నమోదైనట్లు చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 28 Jan 2023, 11:54 am

ప్రధానాంశాలు:

  • తెలంగాణలో జీరో కొవిడ్ కేసులు
  • మూడేళ్ల తర్వాత తొలిసారిగా సున్నా కేసులు
  • వెల్లడించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Telangana Corona Cases
తెలంగాణలో సున్నా కరోనా కేసులు
Telangana Corona Cases: ప్రపంచంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలు, లక్షల సంఖ్యలో వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలోనూ కరోనా మహమ్మారి విధ్వసం సృష్టించింది. మూడేళ్ల క్రితం రోజూ పదుల సంఖ్యలో నమోదైన కేసులు కొన్ని రోజుల్లోనే వందలు, వేలు దాటాయి. ఆ తర్వాక కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి.
తాజాగా.. తెలంగాణలో తొలిసారి జీరో కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ ప్రకటింటింది. శుక్రవారం 3,690 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. ఒక్కరికి కూడా వైరస్ సోకలేదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా వైరస్ ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత జీరో కొవిడ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు.

కరోనా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రోజూ వందలు, వేల సంఖ్యలో కేసులు నమోదయ్యేవని శ్రీనివాసరావు గుర్తు చేశఆరు. ఈ ఏడాది జనవరిలో ఇప్పటివరకు గరిష్టంగా ఒక రోజులో 15 కేసులు నమోదు అయ్యాయని.., తాజాగా కేసుల సంఖ్య జీరోకు పడిపోయింనది తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8.41 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 8.37 లక్షల మంది కోలుకున్నట్లు చెప్పారు.

కేసులు తగ్గినంత మాత్రాన ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. కరోనా మహ్మమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వంతో ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం వంటివి చేయడం మంచిదని సూచించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.