యాప్నగరం

ముహూర్తం వరకూ వెయిట్ చేయలేకపోయిన పెళ్లికొడుకు.. విషాదం

కొడుక్కి పెళ్లి సంబంధం చూశారు. అమ్మయితో నిశ్చితార్థం కూడా జరిపించారు. అయినా కొడుకు తల్లిదండ్రులతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన వెలుగుచూసింది.

Samayam Telugu 20 Jan 2021, 5:25 pm
పెళ్లి చేయండంటూ తల్లిదండ్రులను పరుగులు పెట్టించాడో కొడుకు.. అతని తొందర చూసి మంచి అమ్మాయిని చూసి సంబంధం ఖాయం చేశారు. పనిలో పనిగా నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే పెళ్లి ముహూర్తం విషయమై సందిగ్ధం నెలకొంది. ముహూర్తాలు లేకపోవడంతో కొద్దిగా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అది నచ్చని యువకుడు తీవ్ర మనస్థాపానికి గురై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
marriage


వర్ని మండలంలోని పొట్టిగుట్ట తండాకు చెందిన అశోక్(23) వరికోత యంత్రానికి డ్రైవర్‌గా పనిచేసేవాడు. కొద్దికాలం నుంచి తనకు పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులతో గొడవకు దిగుతున్నాడు. కొడుకు కోరిక మేరకు ఇటీవల రాజీపేట తండాకు చెందిన యువతితో వివాహం నిశ్చయించారు. ఆమెతో నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే పెళ్లికి మంచి ముహూర్తాలు లేవని పెళ్లి డేట్ ఫిక్స్ చేయలేదు. మంచిరోజులు వచ్చాక జరిపిద్దామని వేచిచూస్తున్నారు.

ముహూర్తం ఫిక్స్ చేసే వరకూ ఆగలేకపోయిన అశోక్ తనకు త్వరగా పెళ్లి చేయాలంటూ తల్లిదండ్రులతో గొడవపడడం మొదలుపెట్టాడు. తన పెళ్లికి డేట్ ఫిక్స్ చేయలేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.