యాప్నగరం

కేసీఆర్‌కు మతిస్తిమితం లేదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు.

Samayam Telugu 7 Jan 2021, 11:34 pm
కేసీఆర్ వ్యవహార శైలి, మానసిక స్థితి సరిగ్గా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ ఉద్యోగ నియామక ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ వీరు తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై పలు వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu బండి సంజయ్
bandi sanjay latestbandi sanjay latest


తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని బండి సంజయ్ ఆరోపించారు. 12 శాతం ముస్లింలున్న బీహార్‌లో ఎంఐఎం 5 సీట్లు గెలిస్తే, 85 శాతం హిందూవులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలవాలని ప్రశ్నించారు. మనది హిందు రాష్ట్రం, హిందు దేశమని అందరూ గుర్తుపెట్టుకొని ఓటు వేయాలని కోరారు.

హిందూ దేశంగా ఉన్నా, రామమందిర నిర్మాణానికి ఇన్ని ఏళ్ళు పట్టిందని, దీనికి కారణం సెక్యులర్ పేరుతో అన్ని పార్టీలు ప్రజలతో ఆడుకోవడమే అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. భారతీయుల రక్షణ కోసమే బీజేపీ పని చేస్తోందని, దేశం కోసం త్యాగం చేసింది బీజేపీ మాత్రమే అని కొనియాడారు. దేశంలో హిందువులంతా ఒక్కటవుతున్నారని మిగతా పార్టీలు ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. బండి సంజయ్ తొండి ఆట ఆడబోరని, తొడ గొట్టి ఆడబోరని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.