యాప్నగరం

ఆస్పత్రి భవనంపై నుంచి దూకి.. కరోనా రోగి ఆత్మహత్య

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆస్పత్రి భవనంపై నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు, వెన్నుముకకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 26 Apr 2021, 12:01 pm
కరోనా ప్రతీ చోట విషాదం నింపుతోంది. అనేక ప్రాంతాల్లో కరోనా బారిన పడి ప్రజలు చనిపోతున్నారు. కొందరు వైరస్‌తో చనిపోతుంటే.. మరికొందరు భయంతోనే చనిపోతున్నారు. తాాజాగా కరోనా సోకిన వ్యక్తి ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కేద్రంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
Samayam Telugu కరోనా రోగి ఆత్మహత్య


అయితే ఈ రోజు తెల్లవారు జామున కరోనా ఆసుపత్రి భవనంపై నుంచి దూకాడు. అయితే అతని వెన్నుముక విరిగి తీవ్ర రక్తశ్రావము కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి (40) సంవత్సరాల పై బడి ఉంటాడని అతనికి సంబంధిచి పూర్తి వివరాలు మాత్రం తెలియలేదు. అయితే కరోనా సోకడంతో ధైర్యం కోల్పోయి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.