యాప్నగరం

గుడిలో దేవుడి ముందు జంట దారుణం.. ఎఫైరే కారణమా?

వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వివాహిత జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడిలో ప్రాణాలు తీసుకోవడం సంచలనంగా మారింది.

Samayam Telugu 27 Mar 2021, 1:43 pm
నిజామాబాద్ జిల్లాలో జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. వివాహిత జంట ఆలయంలో ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా సంచలనంగా మారింది. జక్రాన్‌పల్లి మండలం సికిందర్‌పూర్ గ్రామ శివారులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో యువతి, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆలయం లోపల దేవుని విగ్రహం ఎదుట వరండాలో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. విగతజీవులుగా పడి ఉన్న జంట ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులను ఆర్మూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన చిత్తరి సాయికుమార్(30), శైలజ(28)గా గుర్తించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.