యాప్నగరం

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు హైదరాబాదీల దుర్మరణం

నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌ మండలం కొత్తపల్లి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. టైరు పేలడంతో కారు అదుపుతప్పి గాల్లోకి పల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 10 Aug 2022, 8:37 am

ప్రధానాంశాలు:

  • నిజామాబాద్‌ జిల్లాల్లో నెత్తురోడిన రహదారి
  • కారు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
  • హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రమాదానికి గురైన కారు
నిజామాబాద్(Nizamabad) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముక్పాల్‌(Mupkal) మండలం కొత్తపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌(Hyderabad) నుంచి నిర్మల్‌(Nirmal)కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మారుతి స్విఫ్ట్ కారు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన కారు పల్టీలు కొడుతూ డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు పడిపోయింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందినవారుగా గుర్తించారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.