యాప్నగరం

అనాధ మృతి... చేతి సంచిలో భారీగా డబ్బు చూసి షాక్

ఆలయం వద్ద ఓ వృద్ధుడు మృతి చెందాడు. అతనికి ఎవరూ లేరు. దీంతో స్థానికులు అతడి శవాన్ని గుర్తించారు. మృతుడి చేతిలో ఓ సంచిని చూసి అంతా షాక్ అయ్యారు. అందులో భారీగా ఉన్న నగదును చూసి నివ్వెరపోయారు.

Samayam Telugu 9 Mar 2021, 11:22 am
ఓ అనాధ మృతి చెందాడు. అతడికి ముందు వెనుకా ఎవరూ లేరు. అయితే అతడి చేతిలో సంచి చూసి స్థానికులంతా షాక్ అయ్యారు. అందులో ఉన్న డబ్బును చూసి అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట్ మండలం కోమటిపల్లి గ్రామ శివారుల్లో అల్లూరమ్మా ఆలయం వద్ద సాహబ్ అలీ అనే అనాధ వృద్ధుడు మృతి చెందాడు. అయితే అతడి చేతి సంచిలో భారీగా డబ్బును గుర్తించారు స్థానికులు.
Samayam Telugu అనాధ సంచిలో భారీగా నగదు


సాహబ్ అలీ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులకు అతని చేతిలో ఓ సంచి కనిపించింది. ఆ సంచిలో ఏముంది? అని తెరిచి చూసి అంతా షాక్ అయ్యారు. అందులో రూ. 1,42,000 రూపాయలు లభ్యమయ్యాయి. దీంతో ముస్లిం మత పెద్దలు ఆ డబ్బు మొత్తాన్ని లింగంపేట్‌లో ఉన్న మజీద్‌కు విరాళంగా తీసుకున్నారు. అనాధ చేతి సంచిలో ఇంత భారీ మొత్తంలో డబ్బు చూసి అంతా షాక్ తిన్నారు. అనంతరం ఆ డబ్బును మత పెద్దలకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.