యాప్నగరం

ఎకరం అమ్మితే.. రెండెకరాలు మాయం.! మహిళ‌కి మైండ్‌ బ్లాంక్

ధరణి పోర్టల్‌లో పొరపాటు చూసి భూమి అమ్మిన వారికి మైండ్‌ బ్లాంక్ అయింది. ఎకరం అమ్మితే రెండెకరాలు పోయింది. అది చెప్పేందుకు ఆఫీసుకి వెళ్తే పట్టించుకునే వారేరీ?

Samayam Telugu 20 Jan 2021, 4:56 pm
ఏదో అవసరమొచ్చిందని ఎకరా భూమి అమ్ముకున్న కుటుంబానికి రెట్టింపు షాక్ తగిలింది. తాము ఎకరం అమ్మితే ధరణి పోర్టల్‌లో రెండెకరాలు మాయమైంది. కొనుక్కన్న వ్యక్తికి అప్పనంగా మరో ఎకరం బదిలీ అయిపోయింది. అదేంటని అధికారులను ఆశ్రయిస్తే పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో దిక్కుతోచని బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
woman


గాంధారి మండల కేంద్రానికి చెందిన రుక్మిణీబాయికి గ్రామశివారులో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 2003లో ఒక ఎకరం భూమిని విక్రయించారు. అప్పుడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన నాలుగెకరాల్లో 2015లో మరో ఎకరం భూమిని విక్రయించారు. మూడెకరాలు తమ ఆధీనంలోనే ఉంది. 2015లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఇటీవల భూమిని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతవరకూ బాగానే ఉన్నా అక్కడే మొదలైంది అసలు సమస్య.

భూమి కొనుక్కున్న వ్యక్తికి ఎకరం రిజిస్ట్రేషన్ చేస్తే ధరణి పోర్టల్‌లో రెండెకరాలు మాయమైంది. రుక్మిణిబాయి పేరుమీద మూడు ఎకరాల భూమి ఉండాల్సింది పోయి రెండెకరాలే చూపిస్తోంది. ఎకరం చొప్పున రెండుసార్లు రిజిస్ట్రేషన్ జరిగినట్లు చూపించడంతో రెవెన్యూ అధికారు నిర్వాకం బయటపడింది. బాధితులు లబోదిబోమంటూ రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అయితే వారిని పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. తహసీల్దార్ కార్యాలయంలో పట్టించుకోవడం లేదని బాధితులు కలెక్టరేట్‌కి వెళ్లి అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడైనా న్యాయం జరుగుతుందో? లేదో? చూడాలి మరి!!

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.