యాప్నగరం

కేసీఆర్‌కు గుడి కట్టిన వీరాభిమాని షాకింగ్ నిర్ణయం.. సీఎం విగ్రహానికి..

Mancherial: మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ 2016లో పాలరాతితో కేసీఆర్‌కు గుడి కట్టించారు. ఆ గుడిలో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబ సమేతంగా పూజలు కూడా చేసేవారు.

Samayam Telugu 12 Jan 2021, 10:26 pm
ముఖ్యమంత్రిపై వీరాభిమానంతో సొంతింటి ముందు కేసీఆర్‌కు గుడి కట్టిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ టీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉద్యమాకారులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను కలిసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా తనకకు అవకాశం ఇవ్వలేదన్నారు. తన రాజీనామా లేఖను ఆయన కేసీఆర్ విగ్రహానికే అందజేయడం గమనార్హం.
Samayam Telugu విగ్రహానికే రాజీనామా లేఖ ఇస్తూ..
kcr hardcore fan gunda ravinder


మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ 2016లో పాలరాతితో కేసీఆర్‌కు గుడి కట్టించారు. ఆ గుడిలో కేసీఆర్ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుటుంబ సమేతంగా పూజలు కూడా చేసేవారు. గుండ రవీందర్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. స్థానికంగా రవీందర్‌కు తెలంగాణ ఉద్యమకారుడనే పేరు కూడా ఉంది. కేసీఆర్‌కు వీరాభిమాని అయిన రవీందర్ తన ఇంటి ఆవరణలోనే ఆయనకు గుడి కట్టారు.

Must See: undefined

దాన్ని 2016లో కేసీఆర్ జన్మదినం రోజున తన భార్యతో కలిసి ప్రారంభించాడు. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని.. తనకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దేవుడని ఆ సందర్బంగా రవీందర్ చెప్పాడు. అయితే, అప్పట్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదు. వారికోసం ఎదురుచూసి.. రాకపోవడంతో చివరకు అతనే గుడిని ప్రారంభించుకున్నాడు. దండేపల్లిలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్‌ విగ్రహాలను కూడా ఈయన ఏర్పాటుచేశాడు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.