యాప్నగరం

నిజామాబాద్ ఎంపీకి ఢిల్లీ నుంచి ఫోన్.. రెండ్రోజుల్లో హస్తినకు!

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నందిపేట్ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు దిగడంతో ఎంపీ కారు కూడా ధ్వంసమైంది. బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌గా స్పందించింది.

Samayam Telugu 28 Jan 2022, 8:58 pm

ప్రధానాంశాలు:

  • ఎంపీ అర్వింద్‌కి లోక్‌సభ స్పీకర్ ఫోన్
  • ఆర్మూర్ దాడి ఘటనపై ఆరా
  • ఢిల్లీ రావాలని పిలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
arvind
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆర్మూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతల దాడి వ్యవహారం ఢిల్లికి చేరింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీ అర్వింద్‌కి ఫోన్ చేసి దాడి వివరాలు ఆరా తీసినట్లు సమాచారం. నందిపేట్ పర్యటన సందర్భంగా జరిగిన దాడి గురించి ఎంపీ లోక్‌సభ స్పీకర్‌కి వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల సహకరాంతో రాష్ట్ర ప్రభుత్వం తనపై హత్యాయత్నం చేసిందని ఆయన స్పీకర్‌కి చెప్పినట్లు సమాచారం. ఆయన ఢిల్లీ రావాలని ఎంపీకి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రెండు మూడు రోజుల్లో ఎంపీ అర్వింద్ ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు వ్యవహారంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరుపుతోంది. తన హక్కులకు భంగం కలిగించమే కాకుండా తన కాలర్ పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించారంటూ బండి సంజయ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ కమిషనర్ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. జాగరణ దీక్ష చేపట్టిన రోజు జరిగిన సంఘటనలను కమిటీకి వివరించారు. తాజాగా అర్వింద్‌పై దాడి వ్యవహారంతో ఢిల్లీ వర్గాలు ఎలా స్పందిస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.