యాప్నగరం

అర్ధరాత్రి జనం కంటపడిన జంట.. ఒక్కసారిగా షాక్

అర్ధరాత్రి వేళ జంట గుడి వద్ద కనిపించింది. గమనించిన స్థానికులు దగ్గరికెళ్లి చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కి చేరుకున్నారు.

Samayam Telugu 7 Sep 2021, 8:54 pm
మనసులు కలిసిన యువతీయువకులు మూడుముళ్లతో ఏకం కావాలనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఒకరిని మరొకరు ఉండలేక అర్ధరాత్రి వేళ ఊరుదాటారు. కలిసి బతికే ధైర్యం లేకనో.. పెళ్లి చేసుకున్నా కుటుంబ సభ్యులు వదిలిపెట్టరనే భయమో తెలీదు కానీ ఇద్దరూ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ప్రేమించిన పాపానికి ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. తీరా ప్రేమ జంటను అక్కడున్న జనం గమనించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
love couple


నిజామాబాద్‌లోని గౌతమ్ నగర్‌కి చెందిన ప్రశాంత్, బాన్స్‌వాడ సమీపంలోని నెమలి గ్రామానికి చెందిన జ్యోతి మనసులు కలిశాయి. కొద్దికాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్న జంట విషయం ఇంట్లో చెప్పడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వచ్చేశారు. డిచ్‌పల్లి గ్రామ శివారుకు చేరుకుని ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. గొంతుకోసుకుని బలవన్మరణానికి యత్నించారు. అటుగా వెళ్తున్న జనం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రేమ జంటను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.