యాప్నగరం

14 ఏళ్ల బాలికను లొంగదీసుకుని.. నీచం.. కోర్టు సీరియస్, సంచలన తీర్పు

మైనర్ బాలికను మోసం చేసి గర్భవతిని చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద 20 ఏళ్లు శిక్ష విధించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు.

Samayam Telugu 2 Dec 2021, 5:29 pm
బడికెళ్లే వయసు బాలిక మాయమాటలకు మోసపోయింది. తెలిసీ తెలియని వయసులోనే హద్దులు దాటింది. పుస్తకాలు మోయాల్సిన వయసులో గర్భం దాల్చింది. బిడ్డను ప్రసవించి పద్నాలుగేళ్లకే తల్లయింది. మైనర్ బాలికను నమ్మించి లొంగదీసుకుని గర్భవతిని చేసిన దుర్మార్గుడిపై కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కోర్టులో విచారణ జరిపిన జడ్జి బాలికపై అత్యాచారం చేసి తల్లిని చేయడాన్ని సీరియస్‌గా పరిగణించి సంచలన తీర్పు వెలువరించారు. ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
pregnant


నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌కి చెందిన వంశీక్రిష్ణ పద్నాలుగేళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో ఆమెను వలలో వేసుకుని దారుణానికి ఒడిగట్టాడు. తెలిసీ తెలియని మైనర్ బాలికను లొంగదీసుకుని ఏడాదిగా కామకోరికలు తీర్చుకున్నాడు. మోసగాడి వలలో పడిపోయిన బాలిక దాల్చింది. పద్నాలుగేళ్లకే బాలిక తల్లయింది. మగబిడ్డను ప్రసవించింది. తన కూతురిపై అత్యాచారం చేసి గర్భం దాల్చేందుకు కారణమై వంశీక్రిష్ణపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. న్యాయస్థానంలో నేరం రుజువు కావడంతో ముద్దాయికి 20 సంవత్సరాల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు చెప్పారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.