యాప్నగరం

నిజామాబాద్‌ : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

ఎలక్ట్రిక్ బ్యాటరీ పేలి వ్యక్తి చనిపోయిన షాకింగ్ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలిన ఘటనలతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Samayam Telugu 20 Apr 2022, 6:28 pm
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు భయపడి ఎలక్ట్రిక్ బైక్‌లు కొనుగోలు చేస్తే ఆ బ్యాటరీలు ఎప్పుడు పేలతాయో తెలియక జనంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బ్యాటరీలు పేలిన ఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వైజాగ్‌లో బ్యాటరీ పేలి ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూం దగ్ధమైంది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోగా కుటుంబంలో మిగిలిన వారు తీవ్రగాయాలయ్యారు.
Samayam Telugu ebike
పేలిన బ్యాటరీ, ఈ బైక్


నిజామాబాద్ పటణంలోని సుభాష్ నగర్‌లో అర్ధరాత్రి ఈ భారీ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలి విధ్వంసం సృష్టించింది. బైక్ బ్యాటరీని వేరు చేసి ఇంట్లో చార్జింగ్ పెట్టి కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో రామకృష్ణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు కల్యాణ్, కమలమ్మ, కృష్ణవేణిలకు తీవ్రగాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. పేలుడు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎలక్ట్రిక్ బైక్‌ల బ్యాటరీలు పేలిపోతుండడం వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.