యాప్నగరం

బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో కీలక మలుపు.. యువకుడే కారణం!

Nizamabad నగరంలో 17 ఏళ్ల ఓ బాలిక మే 31న భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 14 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆ బాలిక ఇటీవలే కోలుకుంది. కోలుకున్న తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అది విని ఆమె తల్లిదండ్రులు విస్తుపోయారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 15 Jun 2022, 10:14 pm
నిజామాబాద్ నగరంలో మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం ఘటన కీలక మలుపునకు తిరిగింది. 17 ఏళ్ల ఓ బాలిక గత నెల 31న భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. 14 రోజుల పాటు చికిత్స అనంతరం ఆ బాలిక ఇటీవలే కోలుకుంది. కోలుకున్న తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. అది విని ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తనపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడని, ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆ మైనర్ బాలిక చెప్పింది. ఆమె తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Representative Image


Also Read:

పెళ్లైన మర్నాడే రెండో పెళ్లి.. మొదటి భార్యతో పారిపోయిన వరుడు
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.