యాప్నగరం

బిడ్డను ప్రసవించడంతో ఘోరం వెలుగులోకి.. నిజామాబాద్‌లో దారుణం

మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడి బాగోతం బయటపడింది. ఆమె బిడ్డను ప్రసవించిన విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Samayam Telugu 15 Feb 2021, 4:44 pm
మాయమాటలతో మైనర్ బాలికను మోసం చేశాడో యువకుడు. ఆమె గర్భం దాల్చిందని తెలిసినా కుంటిసాకులు చెబుతూ నెట్టుకొచ్చాడు. బాలిక బిడ్డను ప్రసవించినా విషయం గుట్టుగానే ఉంచారు. తీరా ఆ విషయం బాలిక బంధువులకి తెలిసి పోలీసులను ఆశ్రయించడంతో దారుణం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
pregnant


నాగిరెడ్డిపేటకి చెందిన ఓ యువకుడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికపై కన్నేశాడు. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో అక్క వద్ద ఉంటున్న బాలికను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. ఆ విషయం అక్క కుటుంబ సభ్యులు అడిగినా పెళ్లి చేసుకుంటానని కుంటి సాకులు చెబుతూ నెట్టుకొచ్చాడు. ఈలోగా ఆమెకు నెలలు నిండి బాలికను ప్రసవించింది.

అప్పటి వరకూ గుట్టుగా ఉన్న వ్యవహారం బిడ్డను ప్రసవించిందని బంధువులకు తెలియడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను మోసం చేసిన విషయం తెలుసుకుని బంధువులు పోలీసులను ఆశ్రయించారు. మాయమాటలతో బాలికను మోసం చేసి తల్లిని చేశాడని ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.