యాప్నగరం

నిద్రమాత్రలు మింగిన MPDO, ఎమ్మెల్యే సాయం అందలేని.. అసలు కారణం ఏంటంటే

Nizamabad: డిప్యుటేషన్‌పై సిరికొండకు వెళ్లలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 15 Jan 2021, 9:20 pm
నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెకు జక్రాన్‌పల్లి నుంచి సిరికొండకు డిప్యూటేషన్‌ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సహోద్యోగులు తెలిపారు. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. డిప్యుటేషన్‌పై సిరికొండకు వెళ్లలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఇంకా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
mpdo attempts suicide


అయితే, ఎంపీడీవో భారతి తనకు డిప్యూటేషన్‌ను ఆపాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల సమస్య వల్ల సిరికొండకు వెళ్లలేనని ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న పలుకుబడితో ఎమ్మెల్యేను ఈ సాయం అడిగినట్లుగా సమాచారం. అయినా, అది కుదరకపోవడంతో ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు మరింతగా దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.