యాప్నగరం

ఇంటికి అత్తమామలు.. గదిలోకి వెళ్లిన కొత్త అల్లుడు, విషాదం

సంతోషంగా సాగాల్సిన కొత్త జంట కాపురంలో కలహాలు రేగాయి. నాలుగు నెలలకే ఇద్దరి మధ్య వివాదాలు జరగడంతో పెద్దలు సర్ది చెబుదామనుకున్నారు. కానీ అంతలోనే ఊహించని విషాదం ముసురుకుంది.

Samayam Telugu 10 Sep 2021, 11:02 pm
పండగ పూట కొత్తగా పెళ్లైన ఇంట ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆర్నెల్లు కూడా గడవకుండానే కూతురికి అల్లుడికి గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న అత్తమామలు.. కొత్త దంపతులకు సర్దిచెప్పేందుకు ఇంటికొచ్చారు. ఏమనుకున్నాడో ఏమో గదిలోకి వెళ్లిన అల్లుడు తిరిగి రాలేదు. గదిలో ఆత్మహత్యాయత్నం చేయడం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
husband


కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లికి చెందిన రఘువర్ధన్‌(25)కి బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. నాలుగు నెలలు తిరక్కుండానే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సంతోషంగా సాగాల్సిన కొత్త కాపురంలో కలహాలు రేగాయి. నూతన జంట కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పేందుకు అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. కొద్దిసేపటికి అత్తమామలు ఇంట్లో ఉండగానే రఘు గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. పెళ్లైన నాలుగు నెలలకే నవ వరుడి మరణం చూపరులను కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.