యాప్నగరం

నిర్మల్‌లో ప్రధాని మోదీకి అవమానం

రైతు వేదికపై నరేంద్ర మోదీ ఫోటోను ఏర్పాటు చేశారు. దీంతో మోదీ ఫోటోకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేడతో కొట్టారు.

Samayam Telugu 25 Jan 2021, 12:17 pm
ప్రధాని నరేంద్ర మోదీకి ఘోర అవమానం జరిగింది. నిర్మల్ జిల్లాలో మోదీ ఫోటోకు కొందరు అవమాన పరిచారు. నిర్మల్ జిల్లాలోని తానూర్ మండలం భోల్సాలో రైతు వేదికపై ఈ ఘటన జరిగింది. వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి కొందరు ఆవు పేడను పూశారు. చిత్రపటాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పేడతో కొట్టారు. విషయం తెలిసిన బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Samayam Telugu ప్రధాని నరేంద్ర మోదీ
pm modi


మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో ఈ గొడవను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను సైతం వారు లెక్కచేయలేదు. దీంతో ఈ ఘర్షణలో కరీంనగర్ టూ టౌన్ సీఐ అక్ష్మీబాబు తోపులాటలో కిందపడిపోయారు. మరోవైపు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో కూడా టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు.

Read More: హైదరాబాద్‌లో కుటుంబంపై దాడి.. బాధితులపైనే రివర్స్ కేసు పెట్టిన పోలీసులు

113 డివిజన్ చైతన్ననగర్ కాలనీలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సింగ్ అనే యువకుడ్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి దాడి చేశాడని ఆరోపించాడు. కాషాయం కండువా ఎందుకు వేసుకున్నావని బెదిరించాడని బాధితుడు తెలిపారు. దీంతో ఇద్దరు మధ్య మాటా మాటా పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది. రెండు పార్టీలకు నేతలు చేరుకోవడంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.