యాప్నగరం

భార్య తాళి తీయడంతో.. భర్త ప్రాణం పోయింది.. విషాదం

పరువు నిలుపుతుందని మెడలో నుంచి తీసిన పుస్తెల తాడు పతి ప్రాణాలు తీసింది. తాళి తీయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. కలకాలం తోడుంటానని చెప్పి భార్యని ఒంటరిని చేశాడు.

Samayam Telugu 4 Aug 2021, 8:57 pm
భార్య మెడలో కట్టిన తాళిబొట్టు భర్త ప్రాణాలు పోయేందుకు కారణమైంది. పరువు నిలిపేందుకు సాయపడిన పుస్తెల తాడు.. భర్త ప్రాణం మాత్రం నిలపలేకపోయింది. పరువు కోసం తపించిన భార్యని చూసి గర్వపడాలో.. అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్న భర్త అఘాయిత్యానికి బాధపడాలో తెలియని పరిస్థితి. పగోడికి కూడా రాకూడని కష్టం ఆ భార్యాభర్తలకు వచ్చింది. వడ్డీ జలగల ఆగడాలకు భర్త జీవితం విషాదంగా ముగిసిపోయింది. ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
thali


నిజామాబాద్‌కి చెందిన నాగులు తెలిసిన వడ్డీ వ్యాపారి వద్ద కొంతడబ్బు అప్పుగా తీసుకున్నాడు. అవి తిరిగి చెల్లించలేకపోవడంతో వడ్డీ వ్యాపారి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇంటి ముందుకొచ్చి గొడవ చేయడంతో పరువు పోతుందని భావించిన భార్య తన మెడలోని పుస్తెల తాడును ఆయన చేతిలో పెట్టింది. వడ్డీ వ్యాపారి మాటలు.. భార్య తాళిబొట్టు తీసిచ్చేంత దుర్భర పరిస్థితికి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు నాగులు. దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుని ఈలోకం నుంచి తనువు చాలించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.