యాప్నగరం

కాళ్లు మొక్కిన రోజే ఆత్మగౌరవం చచ్చింది.. ఎంపీ అర్వింద్ షాకింగ్ కామెంట్స్

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని టార్గెట్ చేశారు బీజేపీ ఎంపీ అర్వింద్. భైంసాలో హిందువుల ఇళ్లు తగలబెడితే కనీసం స్పందించలేదని మండిపడ్డారు. మంత్రి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

Samayam Telugu 20 Feb 2021, 3:33 pm

ప్రధానాంశాలు:

  • మంత్రి కోసమే దూరంగా కలెక్టరేట్
  • ప్రజలను కుక్కలతో పోల్చడం దారుణం
  • ఇంద్రకరణ్ రెడ్డిపై అర్వింద్ ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
arvind
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘన విజయంతో దూకుడుపెంచిన బీజేపీ అధికార టీఆర్‌ఎస్ నేతలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తోంది. ఏకంగా సీఎం కూతురు కవితను ఓడించి ఢిల్లీకి వెళ్లిన బీజేపీ ఫైర్‌బ్రాండ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న మంత్రి.. ప్రజలను కుక్కలతో పోల్చడం దారుణమని అర్వింద్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా టీఆర్‌ఎస్ నేతల భూకబ్జాలు, బెదిరింపులు బయటపడుతున్నాయని అర్వింద్ అన్నారు.
నిర్మల్ కలెక్టరేట్ దూరంగా నిర్మిస్తుండడంపై ఎంపీ ఆరోపణలు చేశారు. మంత్రి స్వప్రయోజనాల కోసమే కలెక్టరేట్‌ని దూరంగా కడుతున్నారని అర్వింద్ ఆరోపించారు. మంత్రి భూకబ్జాలపై రాబోయే ప్రభుత్వం విచారణ జరిపి భూములను జప్తు చేసుకుంటుందని హెచ్చరించారు. తనకంటే చిన్నవాడైన కేసీఆర్ కాళ్లు మొక్కిన రోజే ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మగౌరవం చచ్చిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భైంసాలో అల్లర్లు జరిగి హిందువుల ఇల్లు తగలబెడితే మంత్రి కనీసం స్పందించలేదని అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన విమర్శించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.