భారీ అవినీతి పాల్పడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కుమారుడు, మంత్రి కేటీఆర్(KTR) జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(dharmapuri arvind) అన్నారు. శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేస్తే.. ఆ పేరుతో ఉన్న కేటీఆర్ పద్నాలుగేళ్లు జైలుకెళ్లటం ఖాయమని పేర్కొన్నారు. ఈ నెల 5న నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్(CCM KCR) పర్యటన నేపథ్యంలో ‘ఇందూర్ జనతాకో జర జవాబ్ దో కేసీఆర్’ పేరిట బీజేపీ శనివారం సభ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఐటీ వెంచర్లలో వాటాల దందా సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ బియ్యం పథకంపై కలెక్టర్ను వివరాలు అడిగితే.. తెలంగాణను అవమానించారని మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ప్రశాంత్రెడ్డి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై సోమవారం జరిగే సభలో మాట్లాడాలని అర్వింద్ డిమాండ్ చేశారు. పసుపు పరిశోధన కేంద్రం, బీడీ భవన్ హామీలు ఏమయ్యానని ప్రశ్నించారు. బోధన్ చక్కెర పరిశ్రమ తెరిపిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మొహం చాటేశారని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశానికి గెస్ట్గా హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ప్రసంగిస్తూ.. భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో యువత ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ముద్ర రుణాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారని ఆరోపించారు
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఐటీ వెంచర్లలో వాటాల దందా సాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ బియ్యం పథకంపై కలెక్టర్ను వివరాలు అడిగితే.. తెలంగాణను అవమానించారని మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ప్రశాంత్రెడ్డి అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై సోమవారం జరిగే సభలో మాట్లాడాలని అర్వింద్ డిమాండ్ చేశారు. పసుపు పరిశోధన కేంద్రం, బీడీ భవన్ హామీలు ఏమయ్యానని ప్రశ్నించారు. బోధన్ చక్కెర పరిశ్రమ తెరిపిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మొహం చాటేశారని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశానికి గెస్ట్గా హాజరైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ప్రసంగిస్తూ.. భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో యువత ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ముద్ర రుణాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో ఇస్తుంటే.. తెలంగాణలో మాత్రం చాలా తక్కువగా ఇస్తున్నారని ఆరోపించారు