యాప్నగరం

Dichpally: ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా.. వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో

Nizamabad Bus Accident: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. పెను ప్రమాదం తప్పింది. ఒంగోలు నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును డిచ్‌పల్లి (Dichpally) వద్ద నేషనల్ హైవేపై ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ దాటికి బస్సు అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 8 Sep 2022, 10:30 pm
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడిన ఘటనలో (RTC Bus Accident) పెను ప్రమాదం తప్పింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ మీదుగా బోధన్ వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును.. డిచ్‌పల్లి వద్ద నేషనల్ హైవేపై వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఆ దాటికి బస్సు అదుపుతప్పి రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu Dichpally Bus Accident
డిచ్‌పల్లి రోడ్డు ప్రమాదం


ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.