యాప్నగరం

Kamareddy: శివాలయంలో అద్భుతం.. శివలింగానికి నాగుపాము ప్రదక్షిణలు !

Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఓ నాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయ ఆవరణలో ఉన్న శివ లింగంపై నాగు పాము భక్తులకు దర్శనం ఇచ్చింది. శివ లింగాన్ని చుట్టుకుని చాలా సేపు అలాగే ఉండిపోయింది. అనంతరం లింగం చుట్టూ సుమారు గంట పాటు నాగు పాము ప్రదక్షిణలు చేసింది. దీంతో ఈ వింతను చూడడానికి భక్తులు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణంతో ఆలయ ప్రాంగణం మెుత్తం మార్మోగిపోయింది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 27 Nov 2022, 12:55 pm

ప్రధానాంశాలు:

  • కామారెడ్డి జిల్లాలోని శివాలయంలో అద్భుతం
  • శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu snake on shiva lingam
శివలింగం
Kamareddy: హిందూ సంప్రదాయంలో ప్రకృతినే దైవంగా భావించి పూజలు చేస్తారు. పశుపక్షాదులతో పాటు పామలు, జంతువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక సర్పాలకు హిందూ ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది. శివడి మెడులో కంఠాభరణం, శ్రీమహా విష్ణువు పాన్పుగా ఆదిశేషుడు ఉంటాడు. పురణాల్లోనూ పాముల గురించి రకరకాల కథలను ప్రస్తావించారు. ఇటీవల కాలంలో తరచుగా ఆలయాల్లో నాగుపాములు ప్రత్యక్షం కావటం మనం వింటూనే ఉన్నాం. తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ భారీ నాగు పాము ఆలయంలో ప్రత్యక్షమైంది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పాటు అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఆలయంలో శివుడు కూడా భక్తులచే ప్రత్యేక పూజలు అందుకుంటాడు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం శివాలయంలోని గర్భాలయంలో ఓ నాగుపాము ప్రత్యక్షం అయింది. శివ లింగాన్ని చుట్టుకుని చాలా సేపు అలాగే ఉండిపోయింది. అనంతరం లింగం చుట్టూ సుమారు గంట పాటు నాగు పాము ప్రదక్షిణలు చేసింది.

దీంతో ఈ వింతను చూడడానికి భక్తులు ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆలయం ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామ స్మరణంతో ఆలయ ప్రాంగణం మెుత్తం మార్మోగిపోయింది. కాసేపటికి పాము ఆలయంలోని ఓ మూలకు చేరుకోగా.. స్నేక్ క్యాచర్స్‌ వచ్చి పాముని ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. అనంతరం నాగుపామును దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలివేశారు.

Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.