యాప్నగరం

జంట హత్యల కలకలం.. కన్నతండ్రి, చిన్నాన్నని హతమార్చిన కొడుకు

కన్నతండ్రితో పాటు చిన్నాన్న దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భూ తగాదాల విషయంలో మాటామాటా పెరగడంతో ఇద్దర్ని గడ్డపారతో దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Edited byరావు | Samayam Telugu 12 Aug 2022, 9:29 am

ప్రధానాంశాలు:

  • స్థల విషయంలో కుటుంబంలో చెలరేగిన గొడవ
  • కన్న తండ్రి, బాబాయిని హతమార్చిన కొడుకు
  • నిజామాబాద్ జిల్లా మోపాల్‌లో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Son killed father
ఘటనా స్థలంలో పడి ఉన్న మృతదేహాలు
కన్నతండ్రితో పాటు చిన్నాన్న దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భూ తగాదాల విషయంలో మాటామాటా పెరగడంతో ఇద్దర్ని గడ్డపారతో దారుణంగా చంపేశాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల అబ్బయ్య, నడిపి సాయి అన్నదమ్ములు. స్థల విషయంలో కుటుంబంలో గొడవ రావడంతో అబ్బయ్య కుమారుడు సతీష్ సమీపంలోని గడ్డపారతో తండ్రితో పాటు చిన్నాన్న నడిపి సాయి కిరాతకంగ దాడి చేశాడు. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఉదయం 6 గంటల 30 నిమిషాల చోటుచేసుకున్న ఈ ఘటనతో మోపాల్ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఈ జంట హత్యల విషయం తెలుసుకోగానే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థల విషయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో నిందితుడు సతీష్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.