యాప్నగరం

Kamareddy: ఛీ వీడసలు కొడుకేనా?.. సపర్యలు చేయలేక తల్లిని చంపేశాడు!

Kamareddy: కన్న కుమారుడే ఓ తల్లి పట్ల కాలయముడయ్యాడు. వృద్దాప్యంలో బాధపడుతున్న ఆమెను భారంగా భావించాడు. సపర్యలు చేయలేక గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చేశాడు. ఈ హృదయవిదారకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 18 Apr 2023, 11:24 am

ప్రధానాంశాలు:

  • కన్న తల్లిన చంపిన కసాయి కొడుకు
  • వృద్ధాప్యంలో సపర్యలు చేయలేక ఘాతుకం
  • కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kamareddy Mother
తల్లిని చంపిన కుమారుడు
Kamareddy Mother: దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. నవమాసాలు మోసి కనిపెంచిన అమ్మకు బిడ్డలే సర్వస్వం. తాను పస్తులుండైనా పిల్లల ఆకలి తీరుస్తుంది. కన్నబిడ్డల కాలికి చిన్న ముళ్లు గుచ్చుకున్నా.. తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. వారి కళ్లలో నీళ్లు కనిపిస్తే.. తల్లి గుండె చెరువవుతుంది. పిల్లలకు ఏ కష్టం రాకుండా.. కంటికి రెప్పలా సాకుతుంది. అలాంటి మాతృమూర్తిని జీవిత చరమాంకంలో దగ్గరుండి చూసుకోవాల్సిన కన్న కొడుకే.. ఆమె పాలిట యముడయ్యాడు. ఆమెకు సపర్యలు చేయలేక గొంతు నులిమి చంపేశాడు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో వెలుగు చూసుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్టబోయిన బాలవ్వ (80)కు ఇద్దరు కుమారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలవ్వ నడవలేనిస్థితికి చేరుకుంది. జీవిత చరమాంకంలో దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకోవాల్సిన చిన్న కుమారుడు బాలయ్య ఆమెను భారంగా భావించాడు. సపర్యలు చేయలేక ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి చీరకొంగుతో బాలవ్వ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఓ రైస్‌మిల్‌ వెనుక భాగంలో గొయ్యి తీసి ఆమెను పాతిపెట్టాడు.

తెల్లారిన తర్వాత ఏమీ తెలియనట్లు తన తల్లి బాలవ్వ కనిపించటం లేదని చుట్టుపక్కల వాళ్లకు చెప్పుకొచ్చాడు. తన తల్లి ఏటో వెళ్లిపోయిందని దొంగ ఏడుపు ఏడ్చాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామ పెద్దలు గట్టిగా నిలదీశారు. అయినా తనకేం తెలయదని బాలయ్య నటించాడు. దీంత గ్రామ పెద్దలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలయ్యను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఆమె బాగోగులు చూడలేక తానే హత్య చేసినట్లు బాలయ్య ఒప్పుకున్నాడు. హత్య చేసిన అనంతరం రైస్ మిల్ వెనుక భాగంలో పూడ్చిపెట్టినట్లు చెప్పాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మార్వో ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా చేశారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. కనిపెంచిన అమ్మను జీవత చరమాంకంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొన్న కొడుకే కాలయముడై ఆమె ప్రాణాలు తీయటం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కొడుకులు పుడితే ఎంతే చస్తే ఎంత అని మండిపడుతున్నారు. కన్నతల్లి అని కూడా చూడకుండా పాశవికంగా హత్య చేసిన బాలయ్యను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.