యాప్నగరం

నా వయసు మీకంటే డబుల్ ఉంటుంది.. స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన వయసు గురించి ప్రస్తావిస్తూ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. తన వయసు మీ కంటే డబుల్ ఉంటుందని.. తనకు 18 ఏళ్ల కొడుకు ఉన్నాడంటూ చెప్పుకొచ్చారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న స్మితా సబర్వాల్ కుటుంబ సంక్షేమ శాక కార్యదర్శితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భిణీలతో ముఖాముఖి మాట్లాడారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ.. తన గురించి, తన వయసు గురించి ప్రస్తావించారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Feb 2023, 3:41 pm

ప్రధానాంశాలు:

  • సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • సభలో తన వయసు గురించి ప్రస్తావించిన స్మితా సబర్వాల్
  • గర్భిణీలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Smita Sabharwal
స్మితా సబర్వాల్
సీనియర్ ఐఏఎస్, తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో ఉన్న స్మితా సబర్వాల్.. కామారెడ్డిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్బిణీలతో ముఖాముఖి అయ్యారు. కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్వేతా మహంతితో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో.. స్మితా సబర్వాల్ తన వయసు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపై సలహాలు సూచనలు చేశారు. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారని తెలిపారు. తన వయసు మీ కంటే డబుల్ ఉంటుందని.. న్యూట్రీషన్ ఫుడ్ తీసుకోవటం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటూ తెలిపారు. ఈ క్రమంలోనే "మీరు చాలా బాగున్నారు మేడం" అని ఓ గర్భిణీ అనటంతో.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఆ మహిళ ఇచ్చిన కాంప్లిమెంట్‌కు వెంటనే తడుముకోకుండా థ్యాంక్యూ అని చెప్పిన స్మితా సబర్వాల్.. తన సందేశాన్ని కొనసాగించారు.
"తల్లి కావటం దేవుడు ఇచ్చిన వరం. మీ చేతిలోనే మీ పిల్లలి ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం ఉంటుంది. తల్లి అయ్యాక మొత్తం సంసారం మర్చిపోతారు. నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీరు అనుకుంటారు నాకు తక్కువ వయసని.. కానీ నాకు తక్కువ వయసేమీ కాదు. మీ అందరి కంటే డబుల్ వయసు ఉంటది. నా కొడుకు వయసు ఇప్పుడు 18 ఏళ్లు. నేను మదర్ హార్లిక్స్ తాగాను. కర్జూరం తిన్నాను. మా అమ్మ ఇచ్చినవి అన్ని తిన్నాను. మంచి తిండి తింటేనే.. పిల్లల్ని చూసుకోవటం.. ఉద్యోగానికి వెళ్లి డ్యూటీ చేయటానికి కావాల్సిన శక్తి వస్తుంది. నేను అమ్మ అయిన సమయంలో నేను కూడా కలెక్టరే. మహిళలపై చాలా బాధ్యతలు ఉంటాయి. అవన్నీ నెరవేర్చాలంటే.. ముందు మీ ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. అప్పుడే అన్ని సక్రమంగా ఉంటాయి." అంటూ తన అనుభవాలను గర్భిణీలతో పంచుకున్నారు.



గర్భిణీల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని స్మితా సబర్వాల్ తెలిపారు. ఇందులో భాగంగానే న్యూట్రిషన్ కిట్లను ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. న్యూట్రిషన్ కిట్లను వాడడం ద్వారా గర్భిణులు ఆరోగ్యంగా ఉంటారని.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామన్న స్మితా సబర్వాల్.. గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ అసుపత్రి వైద్యులు నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేస్తారని గర్బిణీలకు స్మితా సబర్వాల్ తెలిపారు.

మళ్లీ మళ్లీ చస్తానా ఏంటీ..! తన మరణంపై ఇందిర భైరి రాసుకున్న కవిత వైరల్
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.