యాప్నగరం

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి.. దైవ దర్శనానికి వెళుతూ..

Road Accident: నిజామాబాద్ జిల్లాలో రోడ్లు నెత్తురోడాయి. ఆర్మూరు మండలం చేపూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 10 Dec 2022, 10:45 am

ప్రధానాంశాలు:

  • నిజామాబాద్ జిల్లా చేపూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • లారీ, కారు ఢీకొని ముగ్గురు మృతి
  • దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu chepur road accident
రోడ్డు ప్రమాదం
Road Accident: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూరు గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు విడిచారు. వారి వద్ద లభించిన గుర్తింపు కార్డుల ఆధారంగా మృతులు నందిపేట్ మండల కేంద్రానికి చెందిన వారుగా గుర్తించారు. తెలంగాణలో సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మృతి చెందిన వారు నందిపేట్ మండలం సుభాష్‌నగర్‌కు చెందిన మంద మోహన్, ఉమ్మడి అశోక్, రమేష్‌‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.., మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా.. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Latest Telangana News and Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.