యాప్నగరం

జగిత్యాల: తన్నుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. మంత్రి పర్యటనలోనే..

మంత్రి రాకముందే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్యతో పాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Samayam Telugu 30 Dec 2020, 6:20 pm
జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకర్నొకరు తన్నుకున్నారు. మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.‌ పరస్పరం ఘర్షణ పడడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గొల్లపల్లి మండలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మంత్రి పర్యటన వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రతి నినాదాలు చేశారు.
Samayam Telugu కొట్టుకుంటున్న కార్యకర్తలు
trs bjp leaders attacks each other


పరస్పరం విమర్శలు ఆరోపణలతో వాగ్వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కొట్టారు. మంత్రి రాకముందే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్యతో పాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి వ్యతిరేకిస్తూ మంత్రి పర్యటన నిరసిస్తూ స్టేషన్ వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.