యాప్నగరం

రూ.500 కోసం చావబాదారు.. చివరకు ప్రాణం పోయింది

ముగ్గురు స్నేహితులు కలిసి కల్లు కాంపౌండ్‌కు వెళ్లారు. అక్కడ ఫుల్‌గా కల్లు తాగారు. ఈ క్రమంలో గతంలో అప్పుగా ఇచ్చిన రూ.500 తిరిగి ఇవ్వాలని వారి మధ్య గొడవ జరిగింది, దీంతో ఇద్దరు కలిసి ఒకర్ని తీవ్రంగా కొట్టారు.

Samayam Telugu 7 Aug 2021, 8:55 am
డబ్బు ఎలాంటి బంధాల మధ్య అయిన గొడవలు పెట్టేస్తోంది. డబ్బే అన్ని రకాల సమస్యల తీసుకొస్తుంది. డబ్బుల కోసం ఇద్దరు మిత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 4వ తేదీన మల్లారం కల్లు కాంపౌండ్‌లో జగడం విఠల్, తోట జయకృష్ణ, జగడం గంగారాంలు కల్లు సేవించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే, జగడం విఠల్ వద్ద స్నేహితుడు జయకృష్ణ గత కొన్ని రోజుల కిందట రూ.500 అప్పుగా తీసుకున్నాడు. తాగిన మత్తులో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని గొడవకు దిగాడు. అంత వరకు కల్లు కాంపౌండ్ నుండి కదిలేది లేదన్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఘర్షణ జరిగింది. తోట జయకృష్ణతో పాటు జగడం గంగారాంలు మత్తులో విఠల్‌ను తీవ్రంగా గాయపరిచారు.

విఠల్ కల్లు కంపౌండ్‌లోనే స్పృహ తప్పి పడిపోయాడు. విఠల్‌ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. అతన్ని వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.