యాప్నగరం

కట్టుకున్న భార్యే కడతేర్చింది.. దుడ్డుకర్రలతో చితకబాది.. దారుణం

కొద్దిరోజులుగా మద్యానికి బానిసగా మారిన భర్త వేధింపులకు గురిచేసేవాడు. కలహాల కాపురంతో విసిగిపోయిన భార్య భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తన తల్లిదండ్రులతో కలిసి దారుణానికి పాల్పడింది.

Samayam Telugu 4 Apr 2022, 8:35 pm
అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన భార్యే భర్త పాలిట యముడిగా మారింది. కట్టుకున్న భర్తనే కర్కశంగా హతమార్చింది. అందుకు అత్తమామలు కూడా తోడయ్యారు. తాగిన మైకంలో ఉన్న భర్తను విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కామారెడ్డి జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. స్థానిక బీడీ కాలనీకి చెందిన కాసాల బ్రహ్మాచారి(37), నందిని దంపతులు. గత కొద్దికాలంగా బ్రహ్మాచారి మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. నిత్యం తాగుబోతు భర్త వేధింపులు భరించలేకపోయిన భార్య ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తాగిన మైకంలో ఇంట్లో పడుకున్న భర్తను దుడ్డుకర్రతో కొట్టి కిరాతకంగా చంపేసింది. అందుకు ఆమె తల్లిదండ్రులు గంగమణి, దత్తాత్రేయ సహకరించారు. ముగ్గురూ కలసి కర్రలతో అతి దారుణంగా దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కామారెడ్డి రూరల్ సీఐ , ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.