యాప్నగరం

ఇంట్లో శవమైన మహిళా టెక్కీ.. ఎలా చనిపోయింది? మిస్టరీ

వివాహిత అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక మరేదైనా జరిగిందా? అల్లుడే హతమార్చి డ్రామా ఆడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 31 Oct 2021, 7:26 pm
ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే పనిచేస్తోంది. అనూహ్యంగా ఆమె శవమై తేలింది. ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని.. అల్లుడే ఆమెను చంపి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనేది మిస్టరీగా మారింది. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


పట్టణంలోని దేవునిపల్లి ఏరియా దేవి విహార్ కాలనీకి చెందిన హరిప్రసాద్, శిరీష(32) భార్యాభర్తలు. శిరీష్ బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం కావడంతో కామారెడ్డిలోని ఇంటి నుంచే విధులు నిర్వహిస్తోంది. అనూహ్యంగా ఆమె ఆదివారం శవమై కనిపించింది. కూతురు మరణవార్త విన్న తల్లిదండ్రులు వెంటనే ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. తమ కూతురిని అల్లుడు హరిప్రసాదే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శిరీష తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజానిజాలు పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.