యాప్నగరం

మేం లవర్స్ కాదు అన్నా చెల్లెళ్లం.. యువతీయువకుడి ఆత్మహత్యాయత్నం.. యువకుడి మృతి!

నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు, యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. తామిద్దరం అన్నా చెల్లెళ్లమని.. కానీ లవర్స్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆ బాధ భరించలేక చనిపోతున్నామని వారు సూసైడ్ లెటర్ రాశారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 10 Aug 2022, 1:37 pm
నిజామాబాద్ జిల్లాలో ఓ యువ జంట గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు యత్నించింది. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కాలేజీ సమీపంలో నందిపేటకు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు, మరో యువతి కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ యువకుడు వినయ్ మృతి చెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Samayam Telugu Nizamabad Youth
మరణించిన అబ్బాయి


వీరిద్దరూ ఆత్మహత్యకు యత్నించే ముందు సూసైడ్ నోట్ రాశారు. తాము అన్నాచెల్లెళ్లలా మెలిగితే.. ప్రేమికులంటూ తప్పుడు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. మనస్ఫూర్తిగా చెబుతున్నాం.. మేం అన్నా చెల్లెళ్లమే. మేం ఎవరినైనా నొప్పిస్తే.. క్షమించండి. చేయని తప్పును ఒప్పుకోలేక మేం చనిపోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.