యాప్నగరం

చనిపోయాడని తెలియక.. రాత్రంతా మృతదేహంపై నిద్రపోయిన చిన్నారి

రాత్రి పది గంటల సమయంలో అన్న కొడుకును తీసుకొని ఐలయ్య తన బావ ఇంటికి బయల్దేరాడు. అయితే దారిలో రోడ్డుపై ధాన్యం కుప్పల్ని పోశారు. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఐలయ్య వాటిని ఢీకొని కింద పడ్డాడు.

Samayam Telugu 31 May 2021, 6:56 am
రాత్రంతా ఓ చిన్నారి మృతదేహంపై పడుకున్న విషాద ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన తన బాబాయ్... చనిపోయాడన్న విషయం తెలియని చిన్నారి.. రాత్రి అతనిపైనే తల వాల్చి బిక్కు బిక్కుమంటూ ఏడుస్తూ నిద్రపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మర్కూక్‌ మండలం నర్సన్నపేటకి చెందిన ఎక్కలదేవి ఐలయ్య(28) శనివారం రాత్రి పది గంటల సమయంలో జగదేవ్‌పూర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తన బావ వద్దకు అన్న కొడుకు మోక్షిత్‌ (4)ను బైక్‌పై ఎక్కించుకొని వెళ్తున్నాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రాంనగర్‌ సమీపంలోకి రాగానే రోడ్డుపై ధాన్యం కుప్పలు రాశులుగా పోసి వాటిపై కవరు కప్పి ఉన్నాయి. చీకట్లో ధాన్యం కుప్పలు కనిపించకపోవడంతో ఓ కుప్పను ఐలయ్య ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ఐలయ్య తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. రాత్రి సమయం కావడంతో అటువైపు ఎవరూ రాలేదు. దీంతో గాయాల పాలైన చిన్నారి షాక్‌కు గురై ఏడుస్తూ బాబాయ్‌ మృతదేహంపైనే తల ఆనించి పడుకున్నాడు.

ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న ఓ రైతు గమనించి వెంటనే గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి బాలుడు బాబాయ్‌ మృతదేహంపై తలపెట్టి పడుకుని ఉన్నాడు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన సర్పంచ్‌ భానుప్రకాశ్‌రావు బాలుడిని గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యం చూసిన వారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.