యాప్నగరం

Siddipet Food Poison: మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 120 మంది విద్యార్థునులకు అస్వస్థత

Siddipet Food Poison | సిద్ధిపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. ఆదివారం విద్యార్థినులకు చికెన్, వంకాయ కూర కలిపి వడ్డించారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి వారు కడుపు నొప్పితో బాధపడగా.. సోమవారం ఉదయం నుంచి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 27 Jun 2022, 9:39 pm

ప్రధానాంశాలు:

  • సిద్ధిపేట మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్
  • 120 మంది విద్యార్థినులకు అస్వస్థత
  • ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సిద్ధిపేట మైనార్టీ గురుకులం
siddept minority gurukulam
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. దాదాపు 120 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొంత మంది విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన సొంత నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన డాక్టర్లను ఆదేశించారు.
ఆదివారం గురుకులంలో చికెన్ వండి వడ్డించారట. చికెన్‌తోపాటు వంకాయ కూర కలిపి వడ్డించారని తెలుస్తోంది. ఆహారం తిన్న తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. ఆదివారం రాత్రి నుంచి వారు కడుపు నొప్పితో బాధపడ్డారు. సోమవారం నాటికి కొందరిలో కడుపునొప్పి తీవ్రం కావడంతో.. అధికారులకు తెలిపారు. దీంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు వైద్య సిబ్బంది గురుకులానికి చేరుకొని అక్కడే చికిత్స అందించారు. కొందర్ని హాస్పిటల్‌కు తరలించారు.

తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్‌ అలీ, జిల్లా విజిలెన్స్‌ అధికారి గౌస్‌ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్‌ఛార్జి గోపాల్‌రావు.. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.