యాప్నగరం

ఎమ్మార్వో ఆఫీస్‌కి తాళమేసిన ఓనర్.. కారణం తెలిస్తే అవాక్కే

నిత్యం బిజీబిజీగా ఉండే తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశారు భవన యజమాని. తనకు రావాల్సిన డబ్బులు కడితేనే తాళం తీస్తానని తెగేసి చెప్పాడు. చివరికి..

Samayam Telugu 17 Aug 2021, 3:27 pm
పాసు పుస్తకాలో.. ధ్రువీకరణ పత్రాలో.. ఏదో ఒక పనిమీద వచ్చే జనంతో నిత్యం బిజీబిజీగా ఉండే తహసీల్దార్ కార్యాలయానికి ఓనర్ తాళం వేసిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయానికి ఓనర్ తాళం వేయడమేంటని ఆలోచిస్తున్నారా? నిజమే.. అది ప్రభుత్వం కార్యాలయమే కానీ అద్దె బిల్డింగ్‌లో నడుస్తోంది. తహసీల్దార్ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకుని నాలుగేళ్లుగా బాడుగ చెల్లించకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన ఓనర్ తాళం వేసినట్లు తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
locked


జిల్లాలోని గుమ్మడిదల మండల తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తోంది. కార్యాలయానికి బిల్డింగ్ అద్దెకిచ్చిన యజమానికి నాలుగేళ్లుగా అద్దె చెల్లించడం లేదు. ఎన్నిమార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన భవన యజమాని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసేశాడు. నాలుగేళ్ల నుంచి సుమారు ఆరు లక్షల రూపాయలు అద్దె కింద చెల్లించాల్సి ఉందని.. డబ్బులు అడిగినా ఇవ్వడం లేదని యజమాని వాపోయాడు. పెండింగ్‌లో ఉన్న అద్దె బకాయిలు చెల్లిస్తేనే తాళం ఇస్తానని యజమాని భీష్మించాడు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, గుమ్మడిదల పోలీసులు రంగంలోకి దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.