యాప్నగరం

NTR లో నాకు బాగా నచ్చింది అదే.. దాన్నే మనం ఇలా చేశాం: కేసీఆర్

Siddipet: కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌ను 50 ఎకరాల్లో నిర్మించారు. మరో ఎకరం విస్తీర్ణంలో రూ.4 కోట్లతో రెండు అంతస్తుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించారు.

Samayam Telugu 20 Jun 2021, 3:33 pm

ప్రధానాంశాలు:

  • సిద్దిపేట పర్యటనలో కేసీఆర్
  • కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం
  • ప్రభుత్వ పథకాల గురించి చెప్పిన కేసీఆర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
kcr on NT rama rao
గతంలో ఎన్టీఆర్ రూ.2 కే కిలో బియ్యం ఇచ్చారని, అది తనకెంతో నచ్చిన పథకమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దానివల్ల ఎంతో మంది ఆకలి తీరిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత అది ఎన్నో మార్పులు జరిగి.. ఇప్పుడు మనం రూ.1 కే కిలో బియ్యం ఇస్తున్నామని అన్నారు. సమీక్రుత కలెక్టరేట్, కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌ను 50 ఎకరాల్లో నిర్మించారు. మరో ఎకరం విస్తీర్ణంలో రూ.4 కోట్లతో రెండు అంతస్తుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించారు.
‘‘రైతు బంధుపై ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.15 వేల కోట్లు. కొంత మంది బాగా ఫీలవుతున్నారు. దీంట్లో కనీసం రూ.150 కోట్లయినా మేం తినద్దా అని కొంత మంది ఫీలవుతున్నారు. రైతు బంధు దాదాపు 95 శాతం వారికి ఉపయోగపడుతోంది. ఇక ఎక్కడో ఒకరు మందు తాగడానికి వాడుకుంటున్నారు అది వేరే విషయం. రాష్ట్రంలో 93 శాతం మంది రైతులు ఐదెకరాల లోపు వారే ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం భూములు 2.5 కోట్ల ఎకరాలు. కేవలం రైతుల వద్దే కోటిన్నర ఎకరాలు ఉన్నాయి.

ధరణి తయారు చేసేందుకు మూడేళ్లు పట్టింది. రెవెన్యూలో ఇంత గందరగోళం ఎందుకని నేనే మీటింగ్ పెట్టి ధరణి రూపొందించాం. ఇందులో 37 కాలమ్స్ ఉంటే.. నేను మూడే పెట్టించా. ధరణి రూపకల్పనలో నేను పడ్డ బాధ భగవంతుడికే తెలుసు. ధరణిలో భూమి ఎక్కిందంటే.. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. దాన్ని వేరేవాళ్ల పేరు మీదకు రాసే అధికారం ఏ అధికారికీ లేదు. ధరణి వల్ల ఇప్పుడు కేవలం మూడు రకాలుగా మాత్రమే భూమి వేరే వాళ్ల పేరు మీదకు మారుతుంది. అమ్మకం లేదా కొనడం, వారసత్వం, గిఫ్టులాగా భూమి ఇవ్వడం వల్ల మాత్రమే భూమి మరొకరి పేరు మీదకి మారుతుంది.’’ అని కేసీఆర్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.