యాప్నగరం

ముగ్గురు సీఎంలతో పనిచేశా.. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను: జగ్గా రెడ్డి

ముగ్గురు ముఖ్యమంత్రుతో పనిచేశా. వారి రాజకీయ వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నా. నాకు అధికారం మీద ఆసక్తి లేదు. గెలుపోటములను ఒకేలా చూస్తానని జగ్గా రెడ్డి అన్నారు. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 31 Mar 2022, 5:15 pm
కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, సీనియర్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని ఆయన అన్నారు. సంగారెడ్డిలో జరిగిన పాస్టర్ల సమావేశంలో జగ్గా రెడ్డికి మంత్రి పదవి రావాలని.. ఆయన ప్రజలకు మరింత సేవ చేయాలని చేసిన వ్యాఖ్యలపై ఆయన డిఫరెంట్‌గా స్పందించారు. తనది డిఫరెంట్ క్యారెక్టర్ అని.. పదవుల మీద తనకు ఆసక్తి లేదన్నారు. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని జగ్గా రెడ్డి అన్నారు.
Samayam Telugu Sangareddy


తాను ముగ్గురు ముఖమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమారెడ్డి పరిపాలన వ్యవహారాలను దగ్గరి నుంచి చూశానని.. రాజకీయ వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నానని జగ్గా రెడ్డి చెప్పారు. అధికారం మీద తనకు అంతగా ఆసక్తి లేదన్న ఆయన గెలుపోటములను ఒకేలా చూస్తానన్నారు. గెలిస్తే అన్నీ తెలుస్తాయని అనుకుంటామని.. కానీ ఓడిపోతే ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయన్నారు. గెలుపు సేవకు.. ఓటమి అనుభవానికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

ఇటీవల ఎమ్మెల్యే జగ్గా రెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు రేపింది. తొలి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని తప్పుబడుతోన్న జగ్గా రెడ్డి.. ఆయనపై హైకమాండ్‌కి ఫిర్యాదులు కూడా చేశారు. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేసి కోవర్ట్ అని ముద్ర వేస్తున్నారని.. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతానని ప్రకటించారు కూడా. అయితే సీనియర్ల సూచనలతో నిర్ణయం వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నప్పటికీ అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా మంత్రి పదవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.