యాప్నగరం

యజమాని మృతిని భరించలేని కుక్క, ఫోటో చూస్తూ.. స్థానికుల కంటతడి

మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన కన్నాపురం వెంకట్ గౌడ్‌ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. వెంకట్‌ గౌడ్‌కు పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. కొన్నేళ్లుగా ఆయన ఎన్నో శునకాలను పెంచుకుంటున్నారు.

Samayam Telugu 3 Mar 2021, 3:12 pm
కుక్కలను ఆదరిస్తే అవి మనుషులపై చూపించే ప్రేమ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వాసానికి మారుపేరుగా అవి ప్రవర్తిస్తుంటాయి. ఆపద ఎదురైనప్పుడు ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి యజమానుల్ని కాపాడుకున్న ఘటనలు గతంలోనే వెలుగు చూశాయి. పాములతో పోరాడి మరణించిన శునకాల కథలు, వీడియోలు అనేకం. తాజాగా ఓ శునకం తన యజమాని తిరిగి చనిపోయాడని తెలుసుకొని తిండి మానేసి అహర్నీశలు రోధిస్తున్న ఘటన అందరినీ కలచివేసింది.
Samayam Telugu పెంపుడు కుక్క
pet dog cries due to death of his owner


మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన కన్నాపురం వెంకట్ గౌడ్‌ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. వెంకట్‌ గౌడ్‌కు పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. కొన్నేళ్లుగా ఆయన ఎన్నో శునకాలను పెంచుకుంటున్నారు. వాటిని గారాబంగా కుటుంబ సభ్యుల్లాగానే చూసుకునేవారు. అందులో ‘వీరు’ అనే కుక్కను గత ఏడాది కాలంగా పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల వెంకట్‌ గౌడ్‌ చనిపోయారు. దీంతో శునకం వీరు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో దండ వేసి ఉన్న వెంకట్‌ గౌడ్‌ ఫోటోను చూస్తూ, అరుస్తూ ఏడుస్తోంది. గత కొద్ది రోజులుగా అది తిండికూడా తినడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

చనిపోయిన యజమాని పట్ల శునకం చూపిస్తున్న విశ్వాసానికి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఫోటో వైపు చూస్తూ ఆహారం మానేసిన శునకం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.