యాప్నగరం

Medak: వీడెవడండీ బాబు.. అంత చిన్న కారణానికే ఇలా చేస్తారా?

Drunk auto driver: రూ. 20 వేల అప్పుతో పాటు రేషన్ కార్డుతో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కావటం లేదంటూ ఓ వ్యక్తి విద్యుత్ టవర్ ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది.

Authored byసందీప్ పూల | Samayam Telugu 22 May 2023, 9:06 am

ప్రధానాంశాలు:

  • మెదక్ పట్టణంలో వ్యక్తి హల్‌చల్
  • విద్యుత్ టవర్ ఎక్కి దూకేస్తానని బెదిరింపు
  • రూ. 20 అప్పు ఉందని టవర్ ఎక్కిన మందుబాబు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Climbing Electric Tower
Climbing Electric Tower: ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లవర్ మోసం చేసిందని.. సెల్‌ఫోన్ కొనివ్వలేదని.. బంగారు ఉంగరం పోయిందని.. పక్కింటి వాళ్లు తిట్టారని ఇలా సిల్లీ రీజన్స్‌తో ఎంతో విలువైన తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. రూ.20 వేల అప్పు ఉందని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మద్యం మత్తులో విద్యుత్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాడు.
వివరాల్లోకి వెళితే.. మెదక్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సమీర్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం అతడు మెదక్‌ - బోధన్‌ మార్గంలోని విద్యుత్తు టవర్‌ ఎక్కాడు. అతడు పైకి ఎక్కడాన్ని గుర్తించిన స్థానికులు, రోడ్డున పోయేవారు వెంటనే పోలీసులకు విషయం చేరవేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కిందకు దిగాలని సమీర్‌ను విజ్ఞప్తి చేశారు. అయినా అతడు ఏ మాత్రం వినిపించుకోలేదు. తాను కిందకు దిగనని మెుండికేశాడు. సుమారు గంట పాటు టవర్‌పైనే ఉండి హల్‌చల్‌ చేశాడు.

పీసీసీ సభ్యుడు మ్యాడం బాలకృష్ణ వచ్చే వరకు తాను కిందకు దిగనని చెప్పాడు. దీంతో స్థానికులు ఆయనకు విషయం చేరవేశారు. కాంగ్రెస్ నేత మ్యాడం బాలకృష్ణ అక్కడికి చేరుకొని కిందకు దిగాలని సమీర్‌ను విజ్ఞప్తి చేశాడు. ఏం కావాలన్న చేసి పెడతామని.. కిందకు దిగి రావాలని కోరారు. బాలకృష్ణ హామీ మేరకు సమీర్ కిందకు దిగి వచ్చాడు. కిందకు వచ్చాక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోగా.. తనకు రూ. 20 వేల అప్పు ఉందని, రేషన్‌ కార్డులోనూ కుటుంబీకుల పేర్లు నమోదు కావడం లేదని అన్నారు. తన పేరిట వచ్చే రేషన్‌ బియ్యం ఏమాత్రం సరిపోవడం లేదని కుటుంబ పోషణ భారంగా మారిందని చెప్పాడు. ఈ విషయం ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా తన గోడు వినిపించుకోవటం లేదని వాపోయాడు. అందుకే ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యేద్దని హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు.

చిట్టిగుండె ఆగిపోయింది.. 13 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి!
Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.