యాప్నగరం

మొన్న సైదాబాద్ చిన్నారి.. నిన్న సిరిసిల్ల.. ఇప్పుడు సిద్దిపేట.. ఆగని దారుణాలు

కఠిన చట్టాలు చేసినా.. ఉరి శిక్షలు వేసినా కామాంధుల్లో కనీస భయం కలగడం లేదు. చిన్నారులను కూడా వదలకుండా మృగాళ్లు అకృత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మరో దారుణం బయటపడింది.

Samayam Telugu 24 Nov 2021, 7:46 pm
మొన్న సైదాబాద్ చిన్నారి హత్యాచారం.. నిన్న సిరిసిల్ల బాలికపై కామాంధుడి కీచకపర్వం ఘటనలు మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై నీచుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
girl


స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రమేష్(27) కూలీ పనులకు వెళ్తుండేవాడు. అతని ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న ఓ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి రోజూ ఆడుకునేందుకు వచ్చేది. అభం శుభం తెలియని చిన్నారిపై కన్నేసిన కామపిశాచి ఈ నెల 18న ఎవరూలేని సమయం చూసి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి నీచానికి పాల్పడ్డాడు.

ఇంటికి వచ్చిన చిన్నారి విషయం కుటుంబ సభ్యులకు చెప్పినా వవారం రోజులపాటు గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టేశారు. నాలుగు రోజులుగా తప్పించుకు తిరుగుతున్న రమేష్ ఇంటికి రావడంతో చిన్నారి కుటుంబ సభ్యులు చితకబాదారు. గ్రామస్తులు ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.