యాప్నగరం

తల్లి రెండో పెళ్లికి కొడుకు అడ్డు.. కూతురి కోసం అమ్మమ్మ.. ఘోరం

కూతురి భర్త రెండేళ్ల కిందట చనిపోయాడు. ఆమెకి రెండో పెళ్లి చేయాలని తల్లి భావించింది. కానీ అందుకోసం అభం శుభం తెలియని చిన్నారిని కిరాతకంగా హతమార్చడం స్థానికంగా తీవ్ర అలజడి రేపింది.

Samayam Telugu 30 Jul 2021, 4:11 pm
అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మనవడిని సొంత అమ్మమ్మ కిరాతకంగా చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. కూతురికి మరో పెళ్లి చేసేందుకు మనవడు అడ్డుగా ఉన్నాడని ఘాతుకానికి తెగబడింది. మరొకరితో కలిసి దారుణంగా హతమార్చి చెరువులో పడేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డిలో జిల్లాలో కలకలం రేపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
killer lady


రెండేళ్ల బాలుడి అదృశ్యమైన ఘటన విషాదంగా ముగిసింది. సొంత అమ్మమ్మే చిన్నారిని అమానుషంగా హతమార్చినట్టు తేలింది. సంగారెడ్డికి చెందిన యశ్వంత్(2) గురువారం కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ రోజు అనూహ్యంగా సంగారెడ్డిలోని బిబ్బిలకుంట చెరువులో శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో దారుణ నిజాలు వెలుగుచూశాయి.

చిన్నారి యశ్వంత్ తండ్రి రెండేళ్ల కిందట మరణించాడు. భర్త చనిపోయిన కూతురుకి మరో పెళ్లి చేయాలని భావించిన అమ్మమ్మ.. అడ్డుగా ఉన్న మనవడిని కిరాతకంగా చంపేసి చెరువులో పడేసినట్లు పోలీసులు తేల్చారు. మరొకరి సాయంతో మనవడిని మట్టుబెట్టినట్లు గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.