యాప్నగరం

మల్లన్న సాగర్ నిర్వాసితుల ఓట్ల గల్లంతు.. త్వరలోనే తొగుట జెడ్పీటీసీ ఉప ఎన్నిక

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్వాసిత గ్రామాలకు చెందిన 7 వేల మందికి పైగా ప్రజల ఓట్లు గల్లంతయ్యాయి. తొగుట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికారులు ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఈ విషయం బయటపడింది.

Samayam Telugu 10 Apr 2022, 10:38 am
మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్వాసిత గ్రామాలకు చెందిన 7 వేల మందికి పైగా ప్రజల ఓట్లు గల్లంతయ్యాయి. తొగుట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికారులు ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఈ విషయం బయటపడింది. దీనిపై అధికారులను సంప్రదించగా.. తలో మాట చెప్తున్నారు..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని 6 గ్రామాలు మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపునకు గురయ్యాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలను గజ్వేల్‌ సమీపంలో నిర్మించిన పునరావాస కేంద్రాలకు తరలించారు.. అయితే వారికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు పూర్తిస్థాయిలో ఇంకా కేటాయించలేదు. మరోపక్క తొగుట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అధికారులు ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ చేపట్టారు. ముంపు గ్రామాల ప్రజల పేర్లను ఇదివరకు అధికారులు తొగుట మండల ఓటరు జాబితా నుంచి తీసేసినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఏటిగడ్డకిష్టాపూర్‌లో 2,312 మంది, వేములఘాట్‌ 2,059, పల్లెపహాడ్‌ 1,417, లక్ష్మాపూర్‌లో 539, బ్రాహ్మణబంజర్‌పల్లిలో 466 మంది, రాంపూర్‌లో 480 మంది తమ ఓట్లు కోల్పోయారు. దీంతో ఆ ప్రజలు అధికారులను తమ ఓట్ల గురించి ప్రశ్నించారు. అయితే గజ్వేల్‌లో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ.. గజ్వేల్‌లో ఇళ్ల స్థలమే కేటాయించలేదని, ఏ అడ్రస్‌పై ఓటు నమోదు చేసుకోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై తొగుట ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌ స్పందించారు. నిర్వాసిత గ్రామాల ప్రజలంతా పునరావాస కేంద్రాల్లోనే ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.