యాప్నగరం

బాధతో ఊపిరాడకుండా చేసిన తాత.. ఊయలలోనే మనవడు.!

కోడలు రోజూ కొడుకుతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ రాద్ధాంతం చేసేది. సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఒక మనవడు పచ్చకామెర్లతో చనిపోయాడు. మరో మనవడికి కూడా అదే జరుగుతుందని భావించి..

Samayam Telugu 6 Mar 2021, 8:37 pm
మనవడికి పచ్చకామెర్లు రావడంతో ఆస్పత్రిలో స్తోమతకు మించి వైద్యం చేయించాడు. అయినా మనవడు దక్కలేదు. ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఎప్పుడూ కొడుకుతో గొడవపడే కోడలు.. మనవడిని పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని బాధపడేవాడు. కొద్దిరోజులకే కోడలు మరో బిడ్డకు జన్మనిచ్చింది. మనవడిని చూసి సంతోషపడాల్సిన తాత.. పసికందుని పురిట్లోనే చంపేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
infant


రేగోడు వడ్డెర బస్తీకి చెందిన లక్ష్మయ్య, పోచమ్మ భార్యాభర్తలు. వారికి ముగ్గురు కొడుకులు సంతానం. రెండో కుమారుడికి పచ్చకామెర్లు రావడంతో ఆస్పత్రిలో చూపించారు. మనవడి కోసం తాత వెంకట్ సుమారు రూ.40 వేలు ఖర్చు చేశాడు. అయినా మనవడు బతకలేదు. కోడలు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే మనవడు చనిపోయాడని బాధపడేవాడు. ఎప్పుడూ భర్తతో పోచమ్మ గొడవపడుతుండడంతో విసిగిపోయాడు.

కొద్దిరోజులకే గత ఫిబ్రవరిలో ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. పసికందుని కూడా కోడలు సరిగ్గా చూడదని.. పాలు పట్టదని భావించిన వెంకట్ దారుణానికి ఒడిగట్టాడు. శిశువును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 2 వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకట్.. ఊయలలో పడుకుని ఉన్న పసికందుని చూశాడు. కోడలు పోచమ్మ నిద్రిస్తుండగా చిన్నారిని అంతమొందించాడు. కోడలు పోచమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నాలుగు రోజుల్లో కేసును ఛేదించి వెంకట్‌ని రిమాండ్‌కి తరలించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.