యాప్నగరం

చెవికమ్మలు ఇవ్వలేదని చంపేసిన కొడుకు.. మెదక్‌లో దారుణం

బైక్ కొనివ్వలేదని కన్నతల్లిని దారుణంగా చంపేశాడో కిరాతకుడు. తల్లి గొంతునులిమి హతమార్చాడు. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 22 Mar 2022, 7:34 pm
నవమోసాలు మోసి కనిపెంచిన తల్లిని కిరాతకంగా హతమార్చాడో కసాయి కొడుకు. బైక్ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదని దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లి గొంతునులిమి అమానుషంగా హత్య చేశాడు. మెదక్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. నిజాంపేట మండలం నార్లపూర్ ‌గ్రామానికి చెందిన పోచవ్వ(76)కి నర్సింహులు, కుమార్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. బైక్ కొనుక్కోవాలని చిన్న కొడుకు కుమార్ తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె చెవికమ్మలు తీసివ్వాలని కోరాడు.
Samayam Telugu death


అందుకు ఆమె నిరాకరించడంతో కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో కన్నతల్లి అనే కనీస కనికరం కూడా లేకుండా కిరాతకంగా హతమార్చాడు. పెద్ద కొడుకు నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లిని గొంతునులిమి హత్య చేసినట్లుగా విచారణలో తేలిందని నిజాంపేట ఎస్సై తెలిపారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.