యాప్నగరం

మెదక్ ఎమ్మెల్యేకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. స్వల్ప గాయాలు

అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యే కారును వేగంగా వచ్చిన మరొక కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Samayam Telugu 23 Mar 2022, 7:42 pm
మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఆమె కారును వెనక నుంచి మరొక కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కారు ఢీకొన్న ధాటికి ఎమ్మెల్యే కారు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బుధవారం మెదక్ పట్టణంలో పర్యటించారు. అనంతరం రామాయంపేటలో జరుగుతున్న వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కన్నపేట రైల్వే గేటు వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని మరొక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీ శబ్దంతో ఎమ్మెల్యే కారు ఎగిరిపడింది. ప్రమాద సమయంలో పద్మా దేవేందర్ రెడ్డి కారులోనే ఉన్నారు. ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Samayam Telugu Padma Devendar Reddy


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.