ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ నెల 19న గుర్తు తెలియని వ్యక్తి గర్భగుడిలోకి చొరబడి నగలు, సొత్తు ఎత్తుకెళ్లడంతో 3 పోలీసు బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే శనివారం మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం శీలంపల్లిలో చోరీకి గురైన సొత్తును గుర్తించారు. కాగా మొత్తం రూ.2.36 లక్షలతో పాటు పుస్తెలతాడు, వెండి, బంగారు నగలు, ఐదు కొత్త ఫోన్లు లభ్యమయ్యాయి. దొంగతనం చేసింది కామారెడ్డి జిల్లా ఆత్మకూరుకు చెందిన లక్ష్మారెడ్డిగా పోలీసులు తేల్చారు. మెదక్ డీఎస్పీ సైదులు తెలిపిన వివరాల మేరకు.. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా శనివారం ఉదయం కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిందితుడి లక్ష్మారెడ్డి అత్తగారి ఊరు చిలప్చెడ్ మండలం శీలంపల్లికి వెళ్లిందని తెలిపారు.. గ్రామానికి చెందిన కొమ్మన్నగారి బాల్రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారన్నారు.. ఈ క్రమంలోనే ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఎదురుగా చెడిపోయి ఉన్న వాషింగ్ మెషీన్ను తెరిచి చూడగా ఓ సంచి లభించిందని వివరించారు.. అందులో చోరీ సొత్తును గుర్తించారని తెలిపారు.
మొత్తం రూ.2.36 లక్షలు, ఆభరణాలు లభించాయని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు లక్ష్మారెడ్డి పరారీలో ఉన్నాడని.. గాలిస్తున్నామన్నారు. నిందితుడు జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడని వివరించారు.
మొత్తం రూ.2.36 లక్షలు, ఆభరణాలు లభించాయని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు లక్ష్మారెడ్డి పరారీలో ఉన్నాడని.. గాలిస్తున్నామన్నారు. నిందితుడు జల్సాల కోసం దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడని వివరించారు.