Fever Survey : ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు.. కోటికి పైగా హోమ్ కిట్లను రెడీ చేశాం: హరీశ్
Harish Rao : సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఉద్యోగులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ అందరినీ టీకా తీసుకున్నారా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు..
Samayam Telugu 22 Jan 2022, 2:03 pm
ప్రధానాంశాలు:
- సిద్దిపేటలో నిర్వహించిన ఫీవర్ సర్వేలో పాల్గొన్న మంత్రి
- టీకా తీసుకున్నారా లేదా ప్రజలను అడిగి తెలుసుకున్న హరీశ్
- ఫీవర్ సర్వే పట్ల నీతి ఆయోగ్ కూడా హర్షం వ్యక్తం చేసిందని వెల్లడి
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వేను కేసీఆర్ సర్కార్ చేపట్టిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో డోర్ టు డోర్ ఫీవర్ సర్వేలో ఉద్యోగులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ అందరినీ టీకా తీసుకున్నారా లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని హరీశ్ సూచించారు. ‘నిన్న ఒక్కరోజే 12 లక్షల మందికి పరీక్షలు చేశారు. హోమ్ కిట్ మందుల ద్వారా కరోనా లక్షణాలు పోతాయి. రోజు వారీ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని రకాల వైద్యం చేస్తారు. 5 నుంచి 8 వారాలు ఈ సర్వే చేయిస్తాం.. లైన్ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లను పెంచుతాం..’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
మందుల ద్వారా కరోనాను ఎదుర్కొగలిగినప్పటికీ ప్రతి రోజు సర్వే చేస్తున్నామని హరీశ్ తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ‘పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా ప్రత్యేక వార్డులను లాంఛనంగా ఏర్పాటు చేశాం. కోటికి పైగా హోమ్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి గ్రామానికి కిట్లను రెడీ చేశాం. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉంచాం. తెలంగాణలో ఎక్కడ కూడా డాక్టర్ పోస్టులు ఖాళీ లేకుండా ఖాళీలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆశా కార్యకర్తలకు సమాచారం అందించి వారి సేవలను వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రాణ హానీ ఉండదు..’ అని మంత్రి చెప్పారు. సర్వేలో పాల్గొన్న అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మందుల ద్వారా కరోనాను ఎదుర్కొగలిగినప్పటికీ ప్రతి రోజు సర్వే చేస్తున్నామని హరీశ్ తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ‘పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా ప్రత్యేక వార్డులను లాంఛనంగా ఏర్పాటు చేశాం. కోటికి పైగా హోమ్ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి గ్రామానికి కిట్లను రెడీ చేశాం. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది. 370 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రెడీగా ఉంచాం. తెలంగాణలో ఎక్కడ కూడా డాక్టర్ పోస్టులు ఖాళీ లేకుండా ఖాళీలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలు ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆశా కార్యకర్తలకు సమాచారం అందించి వారి సేవలను వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రాణ హానీ ఉండదు..’ అని మంత్రి చెప్పారు. సర్వేలో పాల్గొన్న అధికారులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.